పుట్టిన ప్రతి ఒక్కరూ మరణించక తప్పదు కానీ బ్రతికిన నాలుగు రోజులు ఎలా బ్రతికారు అన్నది గొప్ప .....
జీవితం అంతా తన గౌడ సంఘీయుల ప్రగతికి, అభివృద్దికి నిరంతరం పరితపించిన వ్యక్తి బొల్లా శివయ్య గారు ....
1939 ఆగష్టు 09 తేదీ బొల్లా అమ్మన్న, పాపమ్మ పుణ్యదంపతులకు కృష్ణ జిల్లా లోని వారి స్వగ్రామం అయిన పెడన గ్రామం లో జన్మించారు చిన్నతనం నుంచి చదువులో చురుకుతనముతో ఉంటూ మొదటగా జగ్గయపేట పంచాయతీ కార్యాలయంలో తర్వాత నల్గొండ పౌర సంబంధాల శాఖలో చిరుఉద్యోగము చేస్తూ APPSC ద్వారా హైదరాబాద్ సచివాలయములో ప్రభుత్వ ఉద్యోగము పొంది పలువిబాగములలో విధులు సమర్ధవంతముగా నిర్వర్తించారు టిడిపి ప్రభుత్వము హయాంలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డా.ఎన్.టి. రామారావు గారి కార్యాలయములో ఒక విభాగములో సెక్షన్ ఆఫీసర్ గా మరియు మంత్రిగా ఉన్న శ్రీ అంకేం ప్రబాకరరావు గారి దగ్గర ప్రభుత్వ సహాయ కార్యదర్శిగా చేస్తూ 1997 జూలై 31 పదవీ విరమణ పొందారు. పదవీ విరమణ తర్వాత కూడా ఎల్బి స్టేడియం కార్యనిర్వహణ ఆదికారిగా 3 సంవత్సరాలు పనిచేశారు . ఉద్యోగము చేస్తూనే గౌడ కులమునకు అనేక సేవలు అందించారు. ప్రధానముగా 1973 లో గౌడ అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్స్ సమాఖ్య స్థాపకులలో ఒకరు ,1983 AP గౌడ సంఘం జాయింట్ సెక్రెటరీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వివిధ ప్రాంతాలలో తిరిగి గౌడ జాతి ఉన్నతికి బాటలు వేశారు మరియు ప్రధానముగా ఎవరి కులములో లేని విధముగా గౌడ ఉద్యోగస్తులను అందరినీ కలుపుతూ 1992 లో ఆంధ్రప్రదేశ్ గౌడ ఉద్యోగుల సంక్షేమ సంఘం యేర్పాటు చేసి అనేక విధములుగా గౌడుల అభివృద్దికి పునాదులు వేశారు .... అలాగే ప్రముఖ జనాదరణ కలిగిన మన గౌడ కుల పత్రిక గౌడ ప్రభకు 13 సం లు సబ్ ఎడిటర్ గా, గౌరవ సంపాదకునిగా, ఆంధ్రప్రదేశ్ గౌడ ఉద్యోగుల సంఘము ప్రధాన వ్యవస్థాపకులుగా, శ్రీ శైలం గౌడ సత్రము కార్యవర్గ సభ్యునిగా, ప్రదాన కార్యదర్శిగా ఆయన చేసిన సేవలు ఎనలేనివి, వెలకట్టలేనివి. అలాగే ఘన కీర్తి కావించిన గౌడుల చరిత్ర గ్రంధము రచనలో కూడా ఆయన సహకారము చాలా గొప్పది. గౌడ జాతి చరిత్రలో ఆయన జీవన ప్రయాణము సువర్ణాఖరాలతో లిఖింజబడుతుంది. ఆయన ఆశయ సాధనలో మనం అందరం కలిసి నడవాలని కోరుకుంటూ శ్రీ బొల్లా శివయ్యగారి పవిత్రాత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్ధిస్తున్నాము.
సూరగాని రవిశంకర్, స్టేట్ ప్రెసిడెంట్, ఎపిగేవా
వృత్తికి వన్నె తెచ్చిన వినయశీలి ,కర్తవ్యానికి క్రమశిక్షణ జోడించిన సంస్కారి,సమాజంలో బలహీన వర్గాలకు బాసటగా నిలిచిన సహనశీలి శ్రీ శిరిగిబత్తిన పాండురంగ విటల్ కుమార్ గారు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం లో శ్రీ మాధవ మోహన్ రావు గారు విజయలక్ష్మి గార్ల జేష్ఠ కుమారునిగా 31-01-1964 జన్మించి తల్లిదండ్రుల జన్మపలంగా జీవిత దశలన్నిటిలో పరిశ్రమిస్తూ,ప్రాథమిక విద్య ఉనగట్లలోనూ, మాధ్యమిక విద్య ధవలేశ్వరం,తణుకు, M.A,MCom,M.BA ను ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పూర్తిచేసిన విద్యావంతుడు మనందరి విటల్ కుమార్ గారు.......
ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖలో 12- 2- 1987 లో ఉద్యోగ జీవితం మొదలుపెట్టి వర్క్ ఇన్స్పెక్టర్, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, అసిస్టెంట్ మేనేజర్ గా ,మేనేజర్ గా జిల్లాలో చాగల్లు, నిడదవోలు, దేవరపల్లి, కొవ్వూరు, నరసాపురం, ఏలూరులో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ జిల్లా కలెక్టర్ గారితోను వారి శాఖ ఉన్నతాధికారులతోనూ అనేక ప్రశంసలు పొందిన వ్యక్తి మన విటల్ కుమార్ గారు....
కీర్తిశేషులు నాయుడు సీతా రామ్మోహన్ (కాంట్రాక్టర్ )గారి ద్వితీయ కుమార్తె ఉషారాణి ని వివాహమాడిబాల విజయ నాగ సులోచన B.Tech W/o త్రివాస్ సతీష్ అను కుమార్తెను మరియు నాగార్జున వినయ్ కుమార్ B.Tech కుమారుడిగా సంతానం పొంది వారి భవితకు బంగారు భవిష్యత్తును ఏర్పాటు చేసి ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దిన ఘనత విఠల్ కుమార్ గారిది....
అలాగే వ్యక్తిగత జీవితంతో పాటు సమాజంలో సామాజిక వివక్షత, అణిచివేత ను ఎదుర్కొంటున్న కులాలకే బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం కు ఆర్గనైజింగ్ కార్యదర్శిగా, జిల్లా అధ్యక్షునిగా, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా సమ సమాజ నిర్మాణానికి బాటలు వేస్తూ పుట్టిన కులానికి తనదైన సహాయ సహకారాలు అందిస్తూ తన చుట్టూ ఉన్న సమాజానికి సహాయ సహకారాలు అందిస్తున్న గొప్ప మానవత మూర్తి మన ఎస్ పి ఆర్ విటల్ కుమార్ గారు.....
తేదీ 30-06-2024 ఉద్యోగ బాధ్యతలు విరమణ అనంతరం మీ బావి జీవితం ఆయురారోగ్యాలతో మనుమలు హ్రియన్ష్ తో ఇంకా మనవరాలు తో నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుంటున్నాము.
శ్రీమతి దామర్ల అనూష గారు,
జననం : తేదీ 10-12-1993
తల్లిదండ్రుల పేర్లు : మోర్ల శ్రీనివాసరావు - శ్రీమతి మోర్ల లక్ష్మి
విద్యార్హతలు :- ఎం.టెక్
భర్త : దామర్ల బాలాజీ
ఏపీపీఎస్సీ అసిస్టెంట్ ఇంజనీరు నోటిఫికేషన్ ద్వారా నియామకం పొంది తేదీ 14-09-2017 న ప్రభుత్వ ఉద్యోగిగా మున్సిపల్ కార్పొరేషన్ లో అసిస్టెంట్ ఇంజనీరుగా సర్వీస్ ప్రారంభము. అప్పటి నుండి గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్ లో అసిస్టెంట్ ఇంజనీర్ గా సమర్ధవంతముగా పనిచేస్తూ అందరి మన్ననలను పొంది ఇంజనీరింగ్ విభాగములో అత్యుత్తమ సేవలు అందించినదులకు శ్రీమతి దామర్ల అనూష గారికి తేదీ 15-08-2023న స్వాత్రంత్ర్య దినోత్సవము సందర్భముగా అప్పటి మున్సిపల్ కమీషనర్ చేతులమీదుగా ప్రశంశాపత్రము అందుకున్నారు. వీరు మన గౌడ సంఘీయులు కావడం గౌడ జాతికి గర్వకారణం. ప్రస్తుతము వీరు ఏపీ గౌడ ఉద్యోగుల సంఘము, గుంటూరు జిల్లా కార్యవర్గ సభ్యురాలిగా సంఘానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు.