మంగళవారం స్థానిక ఈడే పల్లి,జిల్
లా బీ.సీ సంక్షేమ సంఘ కార్యాలయం వద్ద బీ.సీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షు
లు కె.వి.వి సత్యనారాయణ ఆధ్వర్యంలో వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖా ధ
ికారిగా పదోన్నతి పై పశ్చిమగోదావరి జిల్లా కు వెళుతున్న సందర్భంగా కృష్ణా
రావును కృష్ణా జిల్లా గౌడ ఉద్యోగుల సంఘం సన్మానించింది. గతంలో ఆయన కృష్ణా
జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ సహాయాధికారిగా విధులు నిర్వర
్తించారు. ఈ సందర్భంగా బి.సి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కె.వి.వి.సత
్యనారాయణ మాట్లాడుతూ కృష్ణారావు మరిన్ని ఉన్నత స్థాయి పదవులను అలంకరించాల
ని ఆకాంక్షించారు. కృష్ణారావు మాట్లాడుతూ శక్తివంచన లేకుండా తన విధ
ులను నిర్వర్తిస్తానని పేర్కొన్నారు. తనకు సన్మానం చేసినందుకు జిల్లా బీ.
సీ, గౌడ సంఘాలకు ఆయన కృతజ్ఞతలు తెలుపుకొ న్నారు. కార్యక్రమంలో జిల్లా గౌడ
ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షులు సింహాద్రి రాంబాబు, వెంకట్రావు, కొనకళ్ళ వ
ెంకటేశ్వరరావు, పోలగాని అశోక్ కుమార్, గున్నం నాగబాబు, మోతుకూరి శివాజీ(మ
ాస్టారు), బెజవాడ మాధవరావు, రాజ్ కుమార్, గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు.